నంద్యాల జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న జిల్లా స్థాయి వాటర్ స్పోర్ట్స్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు అధికారి ఎంఎన్వీ రాజు తెలిపారు. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ పోటీలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారన్నారు.