KNR: ఎండలు పెరుగుతున్నందున గ్రామాల్లో ప్రజలకు మంచి నీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం చొప్పదండి మండలం గుమ్లాపూర్, కాట్నపల్లి పంచాయితీ పరిధి మల్లన్నపల్లి గ్రామాల్లో ఉన్న మంచినీటి బావులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, పంచాయతీరాజ్, అధికారులు పరిశీలించారు.