ELR: చింతలపూడి బస్టాండ్ ఆధునికరణ పనులను ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టబడుతున్న పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి, నాణ్యత విషయంలో రాజీ పడకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా బస్టాండ్ను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలన్నారు.