AP: శ్రీశైలం ఘాట్రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం నుంచి మార్కాపురం వెళ్తుండగా.. డోర్నాల మండలం చిన్నారుట్ల-తుమ్మలబైలు వద్ద ఓ ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.