ELR: తనపై అసత్య ఆరోపణలు చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో అధికారులు ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో తనపై అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం సృష్టించి ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.