NGKL: చారకొండ మండలం శిరుసనగండ్లలో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సీఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో 400 లీటర్ల బెల్లం పానకం, 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అక్రమ మద్యం, కల్తీ కల్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.