ASR: గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి కోసం ఏజెన్సీలో మరో 3,000 ఎకరాల్లో రబ్బరు ప్లాంటేషన్ పెంచాలని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నాయక్ అధికారులను ఆదేశించారు. రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. రబ్బరు సాగుకు అదనంగా 5 స్మోకింగ్ రూములు, జాఫ్రా రైతుల కోసం ప్రాసెసింగ్ మిషన్, ట్రాక్టర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.