CTR: ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా పులిచెర్ల PHC డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రభుత్వంతో సహకరించి సమష్టిగా పోరాడితేనే టీబీని అంతం చేయవచ్చన్నారు. నాలుగు రోడ్ల కూడలిలో ఆరోగ్య సిబ్బంది మానవహారం నిర్వహించి, వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.