అన్నమయ్య: చిట్వేల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఆడపిల్లలకు ఉచిత నాణ్యమైన విద్య అందించేందుకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. 6వ తరగతికి 40, 7వ తరగతికి 13, 8వ తరగతికి 5, 9వ తరగతికి 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఇంటర్మీడియట్ MPCలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. యూనిఫాం, పుస్తకాలు, భోజనం వంటి సదుపాయాలు ఉచితంగా కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తులసి తెలిపారు.