NRPT: మద్దూరు మండలం పల్లెర్లకు చెందిన కె. వెంకటప్ప అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసుకున్న కాంగ్రెస్ నాయకులు సంజీవ్ గౌడ్, ఎండి యాసీన్లు, కొడంగల్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి సహకారంతో సీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షలు మంజూరు చేయించారు. మంగళవారం చెక్కును కుటుంబానికి అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.