సత్యసాయి: కదిరి ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో పవిత్ర స్నపన తిరుమంజనం వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి షాకీర్, మాజీ ఎమ్మెల్యేలు మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, చాంద్ భాషా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి అతిథిగా హాజరయ్యారు.