TG: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నాగర్కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న ఘటనపై ఓ సామాజిక కార్యకర్త జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని మర్రిగూడ మండలం కమ్మగూడెం గ్రామానికి చెందిన వినోద్ హిందుస్థానీ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్వాహకుల కుల దురహంకారం వల్లే జాతరలో ఈ విషాదం చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు.