E.G: గోకవరం మేజర్ గ్రామపంచాయతీ వేలం పాటలు ఈనెల 26వ తేదీకి వాయిదా పడినట్లు గ్రేడ్-1 సెక్రటరీ వై.సూరిబాబు తెలిపారు. మంగళవారం జరగాల్సిన ఈ వేలం, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ రాజమండ్రి పర్యటన నేపథ్యంలో వాయిదా పడిందన్నారు. ఆసక్తి గల వేలంపాటదారులు ఈనెల 26న జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.