SRCL: కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తాడూరు సర్పంచ్ రెడ్డి మల్ల సదానందం అన్నారు. తంగళ్ళపల్లి మండలం తాడూరులో మహిళా భవనానికి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి వర్గానికి లబ్ధి చేకూర్చుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామన్నారు.