AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ అబిడ్స్ సెంటర్లోని శ్రీ నూకాలమ్మ దేవస్థానం ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో రెండు లక్షల 75 వేల 978 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ కొరుప్రోలు శ్రీనివాసరావు తెలిపారు. ఈ లెక్కింపులో శ్రీవారి సేవకులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.