TPT: వరదయ్యపాలెం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు గురించి పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోనే విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో వసతులు, బోధనపై అధికారులకు సూచనలు ఇచ్చారు.