MNCL: బెల్లంపల్లి పట్టణంలోని మహమ్మద్ ఖాసింబస్తీ 30, 31 వార్డులలో UHC ఆధ్వర్యంలో సోమవారం వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సుచిత్ర కాలనీవాసులకు ఆరోగ్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కౌన్సిలర్లు సుకేసిని, స్రవంతి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల వద్దకే వచ్చి వైద్యం అందించడం సంతోషకరమన్నారు. ఈ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.