కృష్ణా: 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు సోమవారం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో సెక్షన్ 144 అమలులో ఉండగా, అనుమతి లేని వ్యక్తులు కేంద్రాల వద్ద గుమికూడరాదని ఎస్సై సత్యనారాయణ సూచించారు.