SRPT: నడిగూడెంలోని పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1984-85 విద్యా సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ కొల్లు పాపయ్య చౌదరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ ఎదుగుదలకు కారణమైన గురువుల విద్యాబోధనను, తల్లిదండ్రుల సహకారాన్ని గుర్తు చేసుకున్నారు.