మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ కొండగట్టుకు పాదయాత్ర చేస్తూ బయలుదేరారు. ధరణి మధుకర్ ఇటీవల హనుమాన్ దీక్షను స్వీకరించారు. దీంతో ఆదివారం ఆయన హనుమాన్ భక్తులతో కలిసి పాదయాత్రగా కొండగట్టుకు బయలుదేరి వెళ్లారు. అంతకు ముందు స్థానిక దేవాలయాల్లో మేయర్ మధుకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా దేవాలయాల నిర్వాహకులు ఆయనను సన్మానించారు.