SKLM: పోలాకి(M) దీర్ఘాసి భవాని కాలనీలో దుర్గాగిరి అమ్మవారి 11వ జాతర మహోత్సవం ఘనంగా కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఆదివారం కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరరావు ఉన్నారు.