AKP: ప్రపంచ దేశాలు యుద్ధ నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఆదివారం రాంబిల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల్లో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపాయి. సీఐటీయూ జిల్లా కార్యదర్శి దేవుడు నాయుడు మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా ఆయిల్, గ్యాస్, నిత్యవసర వస్తువులు ధరలు పెరగడంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు.