ATP: అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ శనివారం అశోక్ నగర్ ఈద్గాలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ముస్లిం మత పెద్దలు, సోదరులను కలిసి ఆప్యాయంగా పలకరించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.