SDPT: కుకునూరు మండలం మంగోల్ గ్రామంలో శనివారం గోటి తలంబ్రాలు కార్యక్రమం నిర్వహించారు. శ్రీ రామకోటి భక్త సమాజం అధ్యక్షులు భక్తిరత్నజాతి అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆధ్వర్యంలో గోటి తలంబ్రాలు కలశాలలో నింపి రామనామ స్మరణతో పురవీధుల్లో హనుమాన్ మందిరం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ 3 గంటలపాటు గోటితో వడ్లను ఒలిచి తలంబ్రాలుగా మార్చారు.