BPT: ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ ట్రయల్స్కు ఎంపికైన చందలూరు విద్యార్థిని నాయపాము శృతికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆర్థిక సహాయం అందించారు. ఏప్రిల్ 13-15 తేదీల్లో హర్యానాలో జరిగే పోటీలకు ఎంపికైన శృతి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనడంతో మంత్రి వెంటనే స్పందించారు. గ్రామీణ విద్యార్థిని అంతర్జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణమని నేతలు తెలిపారు.