NDL: వెలుగోడు మండలం బోయరేవుల గ్రామంలో పొలాలకు వెళ్లే రహదారి పలుచోట్ల దెబ్బతింది. పొలాల నుంచి వచ్చే నీటిజోము రోడ్డుపైకి చేరడంతో దారి మురికిగా మారి రాకపోకలు కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు. రైతులు పంట పొలాలకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రహదారి పక్కన కాలువలు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ఇవాళ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.