KRNL: కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో, ప్రతి శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో అధికారులు ట్రాఫిక్ నిబ౦ధనలు, హెల్మెట్ వాడకం, మైనర్లు వాహనాలు నడపడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.