ADB: ఉట్నూర్లోని ప్రభుత్వ ఐటీఐ గిరిజన కళాశాల కేబీ కాంప్లెక్స్లో విజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభం కానుంది. ఈ మేళాలో వివిధ కంపెనీలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. గ్రామీణ, గిరిజన ప్రాంత యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు తెలిపారు.