ADB: రైతులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా శనివారం సూచించారు. ఆదిలాబాద్ మండలంలోని అర్లీ గ్రామానికి చెందిన రైతు తుడుం గణపతి ఆత్మహత్య ఘటన బాధాకరమని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఏమైనా సమస్యలుంటే వ్యవసాయ అధికారులు సంప్రదించాలని కోరారు.