NLG: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ విద్యారంగ అభివృద్ధికి దోహదపడేలా లేదని టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు నర్సింహ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆయన స్పందించారు. కొఠారి కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం పాటించలేదన్నారు. అదేవిధంగా విద్యకు మేనిఫెస్టోలో పేర్కొన్న 15 శాతం కేటాయించలేదన్నారు.