SRCL: గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టులో ఓ యువకుడు దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు. మృతుడు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూరు చెందిన దుంపటి వినయ్ కుమార్(30)గా గుర్తించారు. నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టులో శుక్రవారం సాయంత్రం వినయ్ శవమై తేడాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.