WGL: వరంగల్ జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి కాగా 6వ నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీ కోసం గురుకుల ప్రవేశ పరీక్షలు ఆదివారం 9 కేంద్రాలలో ప్రశాంతంగా నిర్వహించినట్లు DCO పి. అపర్ణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3,933 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 3,744 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరు శాతం 94.67గా నమోదైనట్లు వెల్లడించారు.