NRML: ఛత్తీస్గఢ్లో జరుగుతున్న 45వ నేషనల్ టీమ్ చెస్ ఛాంపియన్షిప్లో నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలానికి చెందిన గాడి అరుణ్ కుమార్ కోచ్గా ఎంపికయ్యారు. భారత త్రివిధ దళాలకు ప్రాతినిధ్యం వహించే SSCB జట్టుకు ఆయన నేతృత్వం వహించడం విశేషం. ఈ నెల 16 నుంచి 22 వరకు జరిగే ఈ టోర్నీలో అరుణ్ కుమార్ తన జట్టును విజయపథంలో నడిపించాలని జిల్లా వాసులు కోరారు.