NTR: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన ఆర్గానిక్ రైతోత్సవం, న్యాచురల్ ఫార్మింగ్ మేళాను ఎంపీ కేసినేని చిన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రైతులు రసాయన ఎరువులు వాడకం తగ్గించాలనేది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని అన్నారు. ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా అధిక ఆదాయం, నాణ్యమైన ఆహారం అందుతుందని తెలిపారు.