W.G: పెనుమంట్ర మండలం మల్లిపూడిలో రూ.47.50 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులను MLA పితాని సత్యనారాయణ ఆదివారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని ఆయన తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.