నేషనల్ జియోగ్రాఫిక్-2026 సంవత్సరానికి గాను ’33 మంది గ్లోబల్ ఛేంజ్ మేకర్స్’ జాబితాను విడుదల చేసింది. ఇందులో భారతీయ నటీమణులు అలియా భట్, ప్రియాంక చోప్రాకు చోటు లభించింది. పర్యావరణ సుస్థిరత, వాతావరణ మార్పులపై అవగాహన కల్పిస్తున్నందుకు అలియాను ఈ గౌరవం వరించింది. అలాగే ఆరోగ్య సంరక్షణ, ముఖ్యంగా డయాబెటిస్ పట్ల అవగాహన పెంచేందుకు ప్రియాంక చేస్తున్న కృషిని నెట్ జియో గుర్తించింది.