KNR: జమ్మికుంట పట్టణంలో బుధవారం సాయంత్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షలు విరమించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకట్రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్ కుమార్, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ స్వప్న పాల్గొని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.