KMM: హైదరాబాద్ బషీర్ బాగ్లోని దేశోద్ధారక భవన్లో నిర్వహించిన ‘దావత్-ఏ-ఇఫ్తార్’ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సెక్యులర్ పార్టీ అని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం సర్వమతాల ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.