మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం రోటరాక్ట్ క్లబ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీ రాంప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా 31 మంది విద్యార్థులకు ఈ బీసీ స్కాలర్షిప్లను అందజేశారు. ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున రూ. 3,10,000 అందజేశారు.