PPM : జిల్లాలో మార్చి16 నుంచి ఏప్రిల్1 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు 222 పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తూ డ్రోన్లు,పెట్రోలింగ్ బృందాలతో నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విద్యార్థులు ఒత్తిడి లోనుకాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.