PDPL : బోడుప్పల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గోదావరిఖని బాపూజీనగర్కు చెందిన మర్రి ప్రశాంత్ (35), శ్రావణి (32) దంపతులు దుర్మరణం పాలయ్యారు. బంధువుల ఇంటికి బైక్పై వెళ్తుండగా, వెనుకనుంచి వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. ప్రశాంత్ అక్కడికక్కడే మరణించగా, శ్రావణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వీరి 12 ఏళ్ల కొడుకు సహస్రన్ తీవ్రగాయాలతో బయటపడ్డాడు.