GDWL: జనాభా లెక్కల ప్రక్రియలో ఇళ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకు గణనపై సంపూర్ణ అవగాహన అవసరమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. సోమవారం ఐడీవోసీ మందిరంలో జిల్లా స్థాయి ఛార్జ్ అధికారులు, అదనపు ఛార్జ్ అధికారులకు మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణలో ఆయన పాల్గొన్నారు. జనగణనలో ఇళ్ల గణన డిజిటలైజేషన్ పద్ధతిలో నిర్వహించాలన్నారు.