ATP: గుత్తి ఫుట్బాల్ క్రీడా మైదానంలో రెండో రోజు ఆదివారం జరుగుతున్న గుత్తి కోట ఉత్సవాలలో భాగంగా పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు కోట ఉత్సవాల పరిసర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేసి క్షుణంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.