BDK: అశ్వాపురం మండలంలోని జామా మసీదులో నిర్వహించిన పవిత్ర రంజాన్ మాసం ఇఫ్తార్ విందు శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో స్నేహభావం, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఓరుగంటి బిక్ష్మయ్య, గాదె కేశవరెడ్డి పాల్గొన్నారు.