NRML: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని కాలనీలో నీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఖానాపూర్ పట్టణంలో వారు పర్యటించారు. అనంతరం పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, కౌన్సిలర్లు ఉన్నారు.