PDPL: జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అధునాతన వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ డా.శ్రీధర్ కోరారు. ఆసుపత్రిలో నవజాత శిశు సంరక్షణతో పాటు 2డీ ఎకో, లాప్రోస్కోపిక్, యూరాలజీ, రూట్ కెనాల్ చికిత్సలు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సేవలకు సంబంధించి ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని, ఇబ్బందులు ఎదురైతే తనకు ఫిర్యాదు చేయాలన్నారు.