హాకీ వరల్డ్ కప్ టోర్నీకి ఇప్పటికే బెర్తు ఖరారు చేసుకున్న భారత్.. ఇవాళ టోర్నీ క్వాలిఫయర్ ఫైనల్లో ఇంగ్లండ్ను ఢీకొననుంది. నిన్నటి సెమీస్లో ఇటలీపై 1-0 విజయంతో భారత్, మరో సెమీస్లో 2-0తో స్కాట్లాండ్ను చిత్తుచేసి ఇంగ్లండ్ తుదిపోరుకు దూసుకొచ్చాయి. ఇక ఇవాళ్టి ఫైనల్ పోరు హైదరాబాద్ GMC బాలయోగి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.