MLG: రేపటి నుంచి ప్రారంభం ప్రారంభమయ్యే 10వ తరగతి వార్షిక పరీక్షలకు వెంకటాపురం మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని MEO సత్యనారాయణ తెలిపారు. మండలంలో మొత్తం 326 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో డెస్కులు, తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు, లైటింగ్, విద్యుత్ సరఫరా వంటి అవసరమైన సదుపాయాలన్నీ కల్పించామని పేర్కొన్నారు.