PPM: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకం కింద 3వ విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. ఈ ఆర్థిక సాయాన్ని కేవలం దైనందిన అవసరాలకు కాకుండా, వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించాలన్నారు.