ములుగు జిల్లా కేంద్రంలోని దేవాదుల ప్రాజెక్టును ఆదివారం CM రేవంత్ రెడ్డి పరిశీలించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్, దేవాదుల పంప్ హౌస్ వద్ద ఏర్పాట్లను అదనపు కలెక్టర్ మహేందర్ జీ, RDO వెంకటేష్ పరిశీలించారు. భద్రత ఏర్పాట్లను BHPL SP సంకీర్త్ గౌడ్, ఏటూరునాగారం ASP మనన్ భట్ పరవేక్షిస్తున్నారు.